ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలి..

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను…

నాగర్‌కర్నూల్‌లో కుటుంబ కలహాలే హత్యకు కారణం..

నాగర్‌కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం కారణంగా జరిగిన యాదయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య, కుమార్తె, అల్లుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

నాగర్‌కర్నూల్ జిల్లా శిశు సంక్షేమ, మహిళా సాధికార శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, నినాదాల రచన పోటీల విజేతలకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.

ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలు…

నాగర్‌కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాభిషేకం, కలశాభిషేకం, హోమాలు, విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

జూన్ 28న ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం.

జూన్ 28న నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. భరత్ కుమార్ రెడ్డి తెలిపారు. 0-5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.

సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు…

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించడంతో పాటు, శ్రీ జ్ఞానేశ్వర వాత్సుల్య మందిర్‌లోని చిన్నారులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు.

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్ల కేటాయింపును అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల…

దుందుభి వాగుపై రూ.20.20 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సివాడ సమీపంలో దుందుభి వాగుపై రూ.20.20 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో నాగర్‌కర్నూల్–జడ్చర్ల అనుసంధానం బలోపేతమై ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.

హరీష్ రావు వ్యాఖ్యలు తగవు.. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు మానుకోవాలి:

నాగర్‌కర్నూల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

నాగర్‌కర్నూల్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP వినతి

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు