Category: Bhakthi

ఆధ్యాత్మిక శోభతో పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 48వ చాతుర్మాస్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉడిపి ఫలిమారు పీఠాధిపతి విద్యాదిశ శ్రీపాదుల 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించారు.

పెద్ద చింతరేవుల ఆలయంలో 27, 28న ప్రత్యేక యాగపూజలు..

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 27, 28 తేదీల్లో ప్రత్యేక యాగపూజలు, హోమాలు, వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు.

వెంకన్న ఆలయంలో వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం…

బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలర్మేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో శనివారం స్వామి అమ్మవార్ల కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. 36 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు.

శ్రీ శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని గ్రహదోష నివారణ కోసం భక్తులు తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు.

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామికి ఉడిపి, పాలిమార్ పీఠాధిపతుల ప్రత్యేక పూజలు

పెద్దచింతరేవుల ఆంజనేయ స్వామి ఆలయంలో ఉడిపి, పాలిమార్ పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 55 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం అందించనున్నారు.

శ్రీ శనేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్‌లోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని గ్రహ దోష నివారణ కోసం భక్తిశ్రద్ధలతో తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి ప్రత్యేక అనుమతి..

నల్లమల్ల అడవుల్లోని శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి భక్తులకు ప్రత్యేక అనుమతి లభించింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ అధికారులతో చర్చించి ఈ అనుమతి సాధించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు..

తొలి ఏకాదశి, శనివారం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలు…

నాగర్‌కర్నూల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాభిషేకం, కలశాభిషేకం, హోమాలు, విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

జూన్ 23 నుంచి శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జూన్ 23 నుంచి 25 వరకు 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రత్యేక పూజలు, హోమాలు, కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.