Category: Bhakthi

సోమశిలలో అరుదైన దృశ్యం

నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో కృష్ణా నది బ్యాక్‌వాటర్ తగ్గడంతో సప్తనదుల సంగమ క్షేత్రంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం పూర్తిగా దర్శనమిస్తోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

పాలెం వెంకన్న దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం

నాగర్ కర్నూల్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాలాన్ని తెలుసుకొని మెలిగితే దైవానుగ్రహం లభిస్తుందని అర్చకులు తెలిపారు.

నంది వడ్డేమాన్‌లో శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.