యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలు..
కిడ్నీ, అండాశయాలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర క్లిష్టమైన సమస్యలకు యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలతో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు.
కంటి దానం మరో ఇద్దరికి చూపు ప్రసాదం..
41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా నాగర్కర్నూల్ పాత కలెక్టరేట్లో నిర్వహించిన కంటి శిబిరంలో 51 మందికి పరీక్షలు నిర్వహించగా, 21 మందికి కేటరాక్ట్ సమస్య గుర్తించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..
నాగర్కర్నూల్లో జరిగిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఉద్యోగుల జిల్లా సమావేశంలో 2026–28 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేముల కుర్మయ్య ఎన్నికయ్యారు.
పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోరుతూ నాగర్కర్నూల్లో ఉద్యోగుల మహా ధర్నా
పెండింగ్ డీఏల విడుదల, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ డిమాండ్లతో నాగర్కర్నూల్ కలెక్టరేట్ వద్ద జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
ఆధ్యాత్మిక శోభతో పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం..
పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 48వ చాతుర్మాస్య పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉడిపి ఫలిమారు పీఠాధిపతి విద్యాదిశ శ్రీపాదుల 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించారు.
మరోసారి దాతృత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..
పేద విద్యార్థినికి ఉన్నత చదువుల కోసం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అండగా నిలిచారు. బి.పీ.ఎడ్ మొదటి సంవత్సరం ఫీజు కోసం రూ.32 వేల చెక్కును అందజేశారు.
పెద్ద చింతరేవుల ఆలయంలో 27, 28న ప్రత్యేక యాగపూజలు..
పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 27, 28 తేదీల్లో ప్రత్యేక యాగపూజలు, హోమాలు, వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు.
పాలమూరు మహేందర్పై దాడి ఆరోపణలు..
తిమ్మాజిపేట్ పోలీస్ స్టేషన్లో పాలమూరు మహేందర్పై దాడి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించి నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
కులగణన చేపట్టకుంటే బీజేపీని బీసీ సామాజిక వర్గం క్షమించదు
బీసీ కులగణన చేపట్టి ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఏర్పాటు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న నాగర్కర్నూల్ కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
