తనిఖీలో భాగంగా “స్కూల్ ఆఫ్ ఎస్థెటిక్స్” పేరుతో ఒక సంస్థ సౌందర్య వైద్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ శిక్షణను దంత వైద్య అర్హత కలిగిన వ్యక్తి నిర్వహిస్తున్నప్పటికీ, సౌందర్య చికిత్సలకు సంబంధించిన ప్రత్యేక అర్హతలు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు, ఎంబీబీఎస్ పట్టభద్రులు కూడా పాల్గొంటున్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై తెలంగాణ వైద్య మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌందర్య వైద్య చికిత్సలు, వాటికి సంబంధించిన శిక్షణను కేవలం తగిన అర్హతలు, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. అనధికారికంగా నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు రోగుల భద్రతకు, వైద్య వృత్తి నైతిక విలువలకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ తనిఖీ నివేదికను తెలంగాణ వైద్య మండలి సర్వసభ్య సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనుంది. అలాగే, దంత వైద్యుని ప్రమేయంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ దంత మండలికి నివేదిక పంపనున్నట్లు తెలిపింది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఇటువంటి నకిలీ సౌందర్య శిక్షణా సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
నైతిక వైద్య విధానాలను కాపాడడంతో పాటు, అనధికార శిక్షణల నుంచి ప్రజలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ వైద్య మండలి పునరుద్ఘాటించింది: హైదరాబాద్లో నకిలీ సౌందర్య శిక్షణపై తెలంగాణ వైద్య మండలి దాడి..

