Tag: Telangana news

BRS ధర్నాపై కేసులు..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నా నిర్వహించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, RDO కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మర్రి…

పోలీసు సిబ్బంది దృఢత్వానికి క్రీడలు అవసరం..

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని…

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాల సాధనకు అధికారులు, యువత, ప్రతి పౌరుడు బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పస్పుల గ్రామంలో ఓటరు జాబితా డిజిటలైజేషన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం పస్పుల గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఓటరు జాబితా డిజిటలైజేషన్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో కవర్ షెడ్, సీసీ పేవ్‌మెంట్, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు..

కొల్లాపూర్ మండలం సింగోటం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తన వాహనంలో ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్యసాయం అందించారు. మంత్రి మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానం..

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానాన్ని సాధించిన నాగర్‌కర్నూల్ జిల్లాకు మరో గౌరవం దక్కింది. ఉత్తమ జిల్లా టిబి అధికారిగా డాక్టర్ ఎం.డి. రఫీకి తెలంగాణ గవర్నర్ అవార్డు లభించగా, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సన్మానించారు.

550 జీవో ప్రకారమే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి..

మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు, జీవో 114ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో 550ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు తూతు మంత్రం గానే ఉద్యోగాలు

నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ తరచూ పగిలిపోతుండటంతో వేల లీటర్ల తాగునీరు వృథా అవుతోంది. దీంతో మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక మరమ్మతులకు బదులుగా శాశ్వత…

ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా.

నాగర్‌కర్నూల్‌లో సంచలనం సృష్టించిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ ఆర్థిక మోసం బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డా. మల్లురవి హామీ ఇచ్చినట్లు బాధితుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. జప్తు చేసిన ఆస్తులను బహిరంగ వేలం వేసి…