మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సిబ్బందిని సత్కరించి చీరలను పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సిబ్బందిని సత్కరించి చీరలను పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపాలను గమనించి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని దంత వైద్యుల సేవలను కొనియాడారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థిని స్కానింగ్ కేంద్రంలో ప్రసవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, SO ను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 43 వినతులు అందాయి. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
మహబూబ్నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ జియో కార్యాలయ మేనేజర్పై మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు కాగా, యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది.