ఈ సందర్భంగా మాట్లాడిన ఆరోగ్య సిబ్బంది, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి, అత్యవసర పరిస్థితులు, ప్రాణాపాయ సమయాల్లో వైద్యులు అంకితభావంతో సేవలందించి అనేక మంది ప్రాణాలను కాపాడారని కొనియాడారు. కలియుగంలో వైద్యులు దేవతామూర్తుల్లా సేవలందిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.
వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. వైద్యాధికారులు కూడా సిబ్బంది అందించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది స్వరూప రాణి, శశికళ, బొజ్జమ్మ, చంద్రశేఖర్, కే. మంగతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.: లట్టుపల్లి పీహెచ్సీలో వైద్యులకు ఘన సన్మానం
