Tag: Nagarkurnool News

ఆసరా పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి గడువు..

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఆసరా పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి గడువు. అర్హులు అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ నాగిరెడ్డి సూచించారు.

BRS ధర్నాపై కేసులు..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నా నిర్వహించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, RDO కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మర్రి…

పోలీసు సిబ్బంది దృఢత్వానికి క్రీడలు అవసరం..

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని…

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాల సాధనకు అధికారులు, యువత, ప్రతి పౌరుడు బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చెంచు గిరిజనులకు ఆధార్ నమోదు వేగవంతం చేయాలి..

నాగర్‌కర్నూల్ జిల్లాలోని చెంచు గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, నెలాఖరులోగా…

అప్పాయిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన నాణ్యత, మౌలిక వసతులు, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించి విద్యా ప్రమాణాల పెంపునకు…

వీబీజీ రామ్ జీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి.

నాగర్‌కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు తమ సమస్యల పరిష్కారం, పే స్కేల్ అమలు, సమయానికి జీతాలు, ల్యాప్‌టాప్‌ల మంజూరు వంటి డిమాండ్లతో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.

ఫీజుల బకాయి – BJP లడాయి

నాగర్‌కర్నూల్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 'ఫీజుల బకాయి – BJP లడాయి' పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు.

తెలకపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా అన్ని సేవలు సమర్థంగా కొనసాగించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ…

నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో కవర్ షెడ్, సీసీ పేవ్‌మెంట్, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.