నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నికలు

నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నికలు నిర్వహించగా, కోళ్లు శివను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.

లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు మంచి దిగుబడి ఇస్తుందని తెలిపారు.

ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

నాగర్ కర్నూల్ మండలంలోని ఆవంచ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగం – ప్రైవేట్ ప్రచారం

షాద్‌నగర్ డిప్యూటీ DM&HO డాక్టర్ విజయలక్ష్మిపై విధుల్లో నిర్లక్ష్యం, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రమోషన్లు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గర్భిణీలు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కిరాణా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించగా, కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.