నాగర్కర్నూల్ నూతన అదనపు కలెక్టర్ చెన్నయ్యకు జిల్లా టీఎన్జీవో నాయకుల ఘన సన్మానం
నాగర్కర్నూల్ జిల్లాకు నూతనంగా నియమితులైన అదనపు కలెక్టర్ చెన్నయ్యను జిల్లా టీఎన్జీవో నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
తూడుకుర్తిలో గురుకుల పాఠశాల, పీహెచ్సీ నిర్మాణ పనుల పరిశీలన..
తూడుకుర్తిలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల, పీహెచ్సీ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి విద్యార్థులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని…
లోద్ది జాతరకు అటవీ శాఖ అనుమతి నిరాకరణ…
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఈ ఏడాది లోద్ది జాతర నిర్వహణకు అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. పులులు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా సీజనల్ క్లోజర్ అమల్లో ఉన్నందున అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం…
బిజినపల్లిలో నూతన మత్స్యకారుల చేపల విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లిలో నూతన మత్స్యకారుల చేపల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన చేపలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు
బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో SIRపై బీఎల్ఏల సమావేశం.
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సమావేశంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు.
నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్లో నూతన సీసీ కెమెరాల ప్రారంభం..
నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్లో నూతన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని…
నాగర్కర్నూల్ సర్కిల్ ఆఫీస్ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
నాగర్కర్నూల్ సర్కిల్ ఆఫీస్ను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ వార్షికంగా తనిఖీ చేసి, పరిశుభ్రత, ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ కేసుల క్లియరెన్స్, రౌడీషీటర్లపై నిఘా వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
నకిలీ డీఏపీ సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
నకిలీ డీఏపీ ఎరువుల దందా సూత్రధారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే కలెక్టరేట్ ఎదుట భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
తెల్కపల్లిలో SIR ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమీక్ష..
తెల్కపల్లి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి BLAలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. SIR డిజిటలైజేషన్ ఇప్పటికే 86 శాతం పూర్తయిందని వెల్లడిస్తూ మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.
కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్ చోరీ కేసు ఛేదన.
కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్లో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. రూ.1.75 లక్షల నగదు, డీవీఆర్ స్వాధీనం చేసుకుని నిందితుడు చిమ్ముల మల్లికార్జున్ రెడ్డి అలియాస్ చిన్నను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
