Allu Arjun తన పేరు, ఫోటోలు, అలాగే తన వాయిస్‌ను అనుకరిస్తూ రూపొందించిన ఏఐ కంటెంట్‌ను అనధికారికంగా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ Delhi High Court ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది స్వాతి సుకుమారన్‌ కోర్టులో వాదనలు వినిపించారు.
పలు కంపెనీలు అల్లు అర్జున్‌ పేరును, చిత్రాలను అనుమతి లేకుండా ఉపయోగించడమే కాకుండా, ఏఐ యాప్‌ల ద్వారా ఆయన మాట్లాడుతున్నట్లుగా వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నాయని కోర్టుకు తెలియజేశారు. ఇది వ్యక్తిగత హక్కులు, ప్రచార హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు.
ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్‌ తుషార్‌ రావు, ప్రాథమికంగా అల్లు అర్జున్‌ వాదనలను పరిశీలించి, ఆయనకు అనుకూలంగా తక్షణ ఆదేశాలు జారీ చేసే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తరహా ఉల్లంఘనలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.
డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి స్పష్టంచేస్తోంది.: అల్లు అర్జున్‌ పేరు దుర్వినియోగంపై దిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *