ఇ-అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్టాండర్డ్ పరీక్షల్లో రిదా కరీమా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా, 3వ తరగతి విద్యార్థి మహమ్మద్ పైజాన్ రెండవ ర్యాంకు, 6వ తరగతి విద్యార్థిని మేఘన మూడవ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని భారతీయ విద్యా భవన్లో విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించి, సర్టిఫికెట్లు అందజేశారు.
డిఇఓ రమేష్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇలాంటి ప్రతిభ కనబరచడం జిల్లా గర్వకారణమని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఐఐటీ స్థాయిలో విద్యను అందించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు, ప్రిన్సిపాల్ ఫాతిమారెడ్డి, పీడీ వీరప్ప తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు




