Tag: Nagarkurnool News

తెల్కపల్లిలో SIR ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమీక్ష..

తెల్కపల్లి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి BLAలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. SIR డిజిటలైజేషన్ ఇప్పటికే 86 శాతం పూర్తయిందని వెల్లడిస్తూ మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.

కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్ చోరీ కేసు ఛేదన.

కల్వకుర్తిలో మహాలక్ష్మీ వైన్స్ షాప్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. రూ.1.75 లక్షల నగదు, డీవీఆర్ స్వాధీనం చేసుకుని నిందితుడు చిమ్ముల మల్లికార్జున్ రెడ్డి అలియాస్ చిన్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్ర స్థాయి ఖో-ఖో క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన…

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూర్ మండలానికి చెందిన రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు. నీటి పొదుపుతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ప్రారంభం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

బీజేపీ యువ మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారి నియామకం

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారిని రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు గుండె గణేష్ నియమించారు. గత 16 ఏళ్లుగా బీజేపీలో సేవలందిస్తున్న నరేష్ చారి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు తూతు మంత్రం గానే ఉద్యోగాలు

నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ తరచూ పగిలిపోతుండటంతో వేల లీటర్ల తాగునీరు వృథా అవుతోంది. దీంతో మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక మరమ్మతులకు బదులుగా శాశ్వత…

నాగర్ కర్నూల్‌లో భారీ బైక్ చోరీ ముఠా గుట్టురట్టు..

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీసులు భారీ బైక్ చోరీ ముఠాను ఛేదించి 52 దొంగిలించిన మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు డ్రగ్స్ కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం..

2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కోసం DOST స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. స్పెషల్ ఫేజ్ అనంతరం అడ్మిషన్లు ఉండవని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.