ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణను విధిగా కాకుండా సేవా ధర్మంగా భావించి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారు పనిచేశారని ప్రశంసించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణలోనూ ఆమె చూపిన అంకితభావం యువ వైద్యులకు ఆదర్శమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే పరిమితమని, సమాజ సేవకు ముగింపు కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారు తన అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎల్.బి. శ్రీ దేవసహాయం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పి. అమరేందర్ తదితరులు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారి సేవలను కొనియాడారు. ప్రజారోగ్య రంగంలో ఆమె చేసిన కృషి జిల్లాకు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఇంచార్జీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది, మిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారికి హృదయపూర్వక వీడ్కోలు పలికారు.: ప్రజారోగ్య సేవలకు జీవితాన్నే అంకితం చేసిన DM&HO డాక్టర్ స్వరాజ్యలక్ష్మి




