Tag: Telangana Health

తెలకపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా అన్ని సేవలు సమర్థంగా కొనసాగించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ…

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానం..

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానాన్ని సాధించిన నాగర్‌కర్నూల్ జిల్లాకు మరో గౌరవం దక్కింది. ఉత్తమ జిల్లా టిబి అధికారిగా డాక్టర్ ఎం.డి. రఫీకి తెలంగాణ గవర్నర్ అవార్డు లభించగా, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సన్మానించారు.

తూడుకుర్తిలో గురుకుల పాఠశాల, పీహెచ్‌సీ నిర్మాణ పనుల పరిశీలన..

తూడుకుర్తిలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల, పీహెచ్‌సీ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి విద్యార్థులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని…

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ప్రారంభం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

బొప్పల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…

నాగర్‌కర్నూల్ జిల్లా బొప్పల్లి పీహెచ్‌సీని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వ వైద్య కళాశాల నాగర్‌కర్నూల్ నూతన ప్రిన్సిపాల్‌కు విద్యార్థుల ఘన స్వాగతం

ప్రభుత్వ వైద్య కళాశాల నాగర్‌కర్నూల్ నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. దావూద్ సులేమాని మహమ్మద్‌కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆయన నాయకత్వంలో కళాశాల మరింత అభివృద్ధి సాధిస్తుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజారోగ్య సేవలకు జీవితాన్నే అంకితం చేసిన DM&HO డాక్టర్ స్వరాజ్యలక్ష్మి

నాగర్‌కర్నూల్ జిల్లా DM&HO డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి గారికి ఘన పదవీ విరమణ సన్మానం నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో మూడు దశాబ్దాల సేవలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశంసించారు.

నాగర్ కర్నూల్‌లో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 15న కోతకుట్టులేని వ్యాసెక్టమీ శిబిరం నిర్వహించి, అర్హులైన పురుషులకు రూ.1000 ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నారు.

నాగర్ కర్నూల్‌లో ₹23.75 కోట్ల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

నాగర్ కర్నూల్‌లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

లట్టుపల్లి పీహెచ్‌సీలో బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ

లట్టుపల్లి పీహెచ్‌సీలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలు 14 మంది బాలికలకు పంపిణీ చేశారు. అర్హులైన బాలికలు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచించారు.