Tag: Nagarkurnool District

నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం…

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా సిగ్నల్ వద్ద XL లూనాను బులెరో వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రజారోగ్య సేవలకు జీవితాన్నే అంకితం చేసిన DM&HO డాక్టర్ స్వరాజ్యలక్ష్మి

నాగర్‌కర్నూల్ జిల్లా DM&HO డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి గారికి ఘన పదవీ విరమణ సన్మానం నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో మూడు దశాబ్దాల సేవలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశంసించారు.

ఎల్పీజీ గ్యాస్‌పై కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.

జిల్లాలో మూడు కేజీబీవీలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక

నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి, వెల్దండ, నాగర్ కర్నూల్ కేజీబీవీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

నంది వడ్డేమాన్‌లో శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

లింగాలలో కేజీబీవీ 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేసిన వాసవి క్లబ్

లింగాల మండలంలోని కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వాసవి క్లబ్ లింగాల ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.