Tag: Voiceofnagarkurnool

తెల్కపల్లిలో పాడి పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం..

తెల్కపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాడి పశువుల సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే మార్గాలపై రైతులకు పశుసంవర్ధక శాఖ నిపుణులు సూచనలు అందించారు.

పాలెంలో BJYM ‘ఫీజుల బకాయి–BJP లడాయి’.. ఫీజు రీయింబర్స్‌మెంట్

నాగర్‌కర్నూల్, పాలెంలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఫీజుల బకాయి–BJP లడాయి' కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూల్‌లో ఉచిత వినికిడి పరీక్ష శిబిరం విజయవంతం

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వినికిడి పరీక్ష శిబిరంలో 30 మంది వృద్ధులకు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.

పోతుగంటి భరత్ ప్రసాద్ నాగర్‌కర్నూల్ పర్యటన.. టౌన్ ప్రెసిడెంట్ ఇంట్లో భోజనం, రాత్రి బస

నాగర్‌కర్నూల్‌లో ఎస్‌ఐఆర్ మండల్ ప్రభాస్ అభియాన్‌లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ బీఎల్‌ఏ-2లతో సమావేశమై కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అనంతరం కార్యకర్త ఇంట్లో భోజనం చేసి అక్కడే రాత్రి బస చేశారు.

కల్వకుర్తిలో BJYM ఫీజుల బకాయి–BJP లడాయి ఉద్యమం

కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫీజుల బకాయి – BJP లడాయి" కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూల్‌లో SIR మండల ప్రవాస్ అభియాన్.

నాగర్‌కర్నూల్ మండలంలోని పలు గ్రామాల్లో SIR మండల ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించి, ఓటరు నమోదు, కొత్త బూత్‌ల ఏర్పాటు, బూత్ రేషనలైజేషన్‌పై అధికారులు, నాయకులు సమీక్ష నిర్వహించారు.

ప్రజావాణిలో 12 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మొత్తం 12 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో 8 భూ వివాదాలు, 4 న్యాయ సంబంధిత ఫిర్యాదులు ఉండగా, తక్షణ పరిష్కారం కోసం…

తెలకపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా అన్ని సేవలు సమర్థంగా కొనసాగించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ…

ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.

పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాల ప్రారంభం..

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, త్రిదండి చిన్న జీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు. విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.