Tag: Voiceofnagarkurnool

అప్పాయిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన నాణ్యత, మౌలిక వసతులు, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించి విద్యా ప్రమాణాల పెంపునకు…

ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్‌తో వెంటనే PRC ప్రకటించాలి:

నాగర్‌కర్నూల్ టౌన్, మండలంలోని పాఠశాలల్లో నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రమేష్ పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 51% ఫిట్మెంట్‌తో PRC…

విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని కలిసి పీఆర్సీ, డీఏ బకాయిలు, ఆరోగ్య పథకం అమలు, పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి…

భూ భారతి పోర్టల్‌పై పూర్తి అవగాహన పెంచుకోండి..

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి పోర్టల్ నిర్వహణ, భూ రికార్డుల పారదర్శకత, ఆన్‌లైన్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…

టెట్ పాస్ కాని ఉపాధ్యాయులకు ఎస్‌టీయూటీ టెట్ మెటీరియల్ ఉపయోగకరం

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన టెట్ మెటీరియల్‌ను డీఈవో ఏ. రమేష్ కుమార్ ఆవిష్కరించారు. టెట్ పాస్ కాని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

48వ చాతుర్మాస్య మహోత్సవాలు…

జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 25 వరకు 48వ చాతుర్మాస్య మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తుల కోసం…

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ..

క్లాస్మేట్ క్లబ్ 365 రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా తాడూరు మండలంలోని ఎంపీపీఎస్ తాడూరు హెచ్‌డబ్ల్యూ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ఉపన్యాస పోటీలు కూడా నిర్వహించారు.

దివ్యాంగులకు సకాలంలో UDID కార్డులు అందించాలి.

దివ్యాంగులకు సకాలంలో UDID కార్డులు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నల్లమల్ల చెంచుల కోసం ప్రత్యేక మొబైల్ క్యాంపులు, అచ్చంపేట ఆస్పత్రిలో సదరం కేంద్రం, శ్రవణ లోపం ఉన్న వారికి…

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 2 రోజుల జైలు.

నాగర్‌కర్నూల్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వస్పరి ఆంజనేయులకు కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

వీబీజీ రామ్ జీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి.

నాగర్‌కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు తమ సమస్యల పరిష్కారం, పే స్కేల్ అమలు, సమయానికి జీతాలు, ల్యాప్‌టాప్‌ల మంజూరు వంటి డిమాండ్లతో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.