ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, తాము 2006 నుంచి వీబీజీ రామ్ జీ పథకంలో సేవలు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లోనే పే స్కేల్ అమలు చేస్తామని మంత్రి సీతక్క ఇంద్రవెల్లి సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన షట్డౌన్, పెన్డౌన్ ఆందోళనలో భాగంగా నాలుగో రోజు జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకే సాంకేతిక సహాయకుడు 5 నుంచి 8 గ్రామాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోందని, దీంతో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతోందన్నారు.
అదనంగా, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేందుకు అవసరమైన ల్యాప్టాప్లు, ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. డిమాండ్ అలొకేషన్ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించి, పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 20 మండలాలకు చెందిన వీబీజీ రామ్ జీ ఉద్యోగులు పాల్గొన్నారు.: వీబీజీ రామ్ జీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి.
