Tag: Voiceofnagarkurnool

శ్రీ శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని గ్రహదోష నివారణ కోసం భక్తులు తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు.

BRS ధర్నాపై కేసులు..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నా నిర్వహించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, RDO కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మర్రి…

కల్యాణ లక్ష్మిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో నీరుగార్చింది

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చుతోందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

నాగర్‌కర్నూల్‌లో మహిళ హత్య కేసు ఛేదన..

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో 43 ఏళ్ల మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి కౌలు విషయంలో ఏర్పడిన విభేదాలే హత్యకు కారణమని తెలిపారు. మృతురాలి బంధువైన కరావత్ హీరమ్మను అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి…

ఐడీఓసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు..

నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయాల పరిశుభ్రత, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వినియోగంలో లేని రికార్డులను నిబంధనల ప్రకారం తొలగించాలని,…

పోలీసు సిబ్బంది దృఢత్వానికి క్రీడలు అవసరం..

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని…

బెక్కేరలో రీ-సర్వే పనుల పరిశీలన..

కల్వకుర్తి మండలం బెక్కేర గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య పరిశీలించారు. రీ-సర్వేపై ప్రజల అపోహలను తొలగించి, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రైతుల ప్రయోజనాలే లక్ష్యం..

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తిలో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర…

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

బిజినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, వంటగదిని పరిశీలించిన కలెక్టర్.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా…

హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం…

# హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టడంలో అవగాహన అత్యంత కీలకమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. జిల్లా స్థాయి ముమ్మర IEC ప్రచార కార్యక్రమం–2026లో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.