Tag: Telangana news

నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నాగర్ కర్నూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించగా, వాసవి & వనిత క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

సిర్సనగండ్లలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగి భక్తులను ఆకట్టుకుంది.

రామనవమి వేడుకల్లో చిన్నారుల అలరింపు

నాగర్ కర్నూల్‌లో రామనవమి సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ చిన్నారులు సీతా, రామ, లక్ష్మణ, హనుమాన్ వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.

నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

నాగర్ కర్నూల్‌లో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్లపై ఉద్రిక్తత

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్ల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, పోలీసులతో BRS శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలో ఘర్షణ చోటుచేసుకుంది.

నాగర్ కర్నూల్ కొత్త బస్ స్టేషన్‌కు శంకుస్థాపన తేదీ ఖరారు చేయాలి

నాగర్ కర్నూల్‌లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన తేదీని ఖరారు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కోరారు. రవాణా సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రస్తావించారు.

సలేశ్వరం జాతరకు విస్తృత ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

అసెంబ్లీలో నాగర్‌కర్నూల్ సమస్యలపై ఎమ్మెల్యే ప్రస్తావన

అసెంబ్లీలో జీరో అవర్‌లో నాగర్‌కర్నూల్ ట్రాఫిక్, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు కోరారు.

టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థనలు

నాగర్ కర్నూల్‌కు చెందిన టి-న్యూస్ రిపోర్టర్ రియాజ్ తండ్రి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి అవసరం

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 34 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని అదనపు కలెక్టర్లు సూచించారు.