సమాచారం ప్రకారం, సలేశ్వరం జాతర బందోబస్తు విధుల నిమిత్తం అచ్చంపేట ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భయన్న మృతదేహాన్ని అచ్చంపేట నుంచి నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మర్చురీకి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు వివాహిత కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఈ సంఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.: హోంగార్డు అనుమానాస్పద మృతి కలకలం
