Category: latest News

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని తెలంగాణ అభివృద్ధిపై ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమరవీరులకు నివాళులర్పించిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు.

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి తెలంగాణ ఆరోగ్య రంగ అభివృద్ధి, మాతా శిశు సంరక్షణలో జిల్లాలో సాధించిన పురోగతిపై వివరించారు.

ప్రజారోగ్య సేవలకు జీవితాన్నే అంకితం చేసిన DM&HO డాక్టర్ స్వరాజ్యలక్ష్మి

నాగర్‌కర్నూల్ జిల్లా DM&HO డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి గారికి ఘన పదవీ విరమణ సన్మానం నిర్వహించారు. ప్రజారోగ్య రంగంలో మూడు దశాబ్దాల సేవలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశంసించారు.

రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి పర్యటన

మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనతో పాటు ఉమ్మడి జిల్లాల ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల పునఃప్రవేశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

నాగర్ కర్నూల్‌లో విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తుల పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో లక్ష అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ…

నంది వడ్డేమాన్‌లో బడిబాట ర్యాలీ.. ఉత్తమ విద్యార్థులకు ఘన సన్మానం

నంది వడ్డేమాన్ గ్రామంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించి, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు…

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమర్నాథ్, కేదార్నాథ్, చార్ ధాం యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయం ప్రారంభం…

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళా వ్యాపారులకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.