Category: latest News

నాగర్ కర్నూల్‌లో ఏప్రిల్ 6న జాబ్ మేళా

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్ మరియు బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులకు ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని జూనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్రీడా సామాగ్రి పంపిణీ

కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసి, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించారు.

6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

నాగర్ కర్నూల్ 6వ వార్డ్‌లో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

నాగర్ కర్నూల్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

నాగర్ కర్నూల్ 6వ వార్డ్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, పేదల గృహ కలను నెరవేర్చే ప్రభుత్వ కృషిని వివరించారు.

తాడూరు PACS మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాడూరు PACS వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి ప్రారంభించి, అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

గుండె శస్త్రచికిత్స అనంతరం జాఫర్‌ను పరామర్శించిన మర్రి జనార్ధన్

నాగర్‌కర్నూల్ పట్టణంలోని రిపోర్టర్ రియాజ్ తండ్రి జాఫర్ గుండె శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నాగర్‌కర్నూల్‌లో ఈనెల 8న ఉచిత కంటి చికిత్స శిబిరం

నాగర్‌కర్నూల్‌లో ఈనెల 8న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత క్యాటరాక్ట్ ఆపరేషన్లు అందించనున్నారు.

రైతుల ప్రతి గింజ కొనుగోలు చేయాలి

యాసంగి పంటలో రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.