నాగర్‌కర్నూల్‌లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమాల భాగంగా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS) ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం మంగళవారం పాత కలెక్టరేట్‌లోని ఐసిడిఎస్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) సురేష్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడంలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. బాల్యవివాహాలు సమాజానికి ముప్పుగా మారుతున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మండల రెవెన్యూ అధికారి సబితారాణి, ఉప తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జి సీడీపీఓ శోభారాణి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా అంగన్వాడీల ద్వారా చేపట్టిన కార్యక్రమాల వివరాలను వివరించారు. ముఖ్యంగా కిశోర బాలికలకు బాల్యవివాహాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
అదనంగా, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వారి బరువు, ఎత్తు, పోషకాహార స్థితి, ఆరోగ్య పరిస్థితులపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కృష్ణవేణి, బ్లాక్ కోఆర్డినేటర్, సఖి, హెల్ప్‌లైన్, భరోసా ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.: క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అరికట్టడంలో అంగన్వాడీల పాత్ర కీలకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *