నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హేమంత కేశవ్ పాటీల్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా విద్యా రంగ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కలెక్టర్‌తో అధికారులు చర్చించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించే చర్యలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశంలో జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు, స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు శెట్టి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి విద్యాశాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. విద్యా అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అధికారులు అభిప్రాయపడ్డారు.: నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ను కలిసిన విద్యాశాఖ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *