Tag: Nagar Kurnool

తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..

తిమ్మాజిపేట రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు కార్డులు, చెక్కులు అందజేశారు.

ప్రజావాణిలో 8 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ…

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ 8 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

సంచార జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి సారించాలి

సంచార, విముక్త జాతుల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి సారించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కులగణనలో ఓపెన్ కాలం తొలగించి ప్రత్యేక బీసీ కాలమ్ పెట్టాలి:

కులగణనలో ఓపెన్ కాలమ్‌ను తొలగించి బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలంటూ..

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన నాగర్ కర్నూలు కలెక్టర్..

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులకు నెల రోజుల్లో అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

తిమ్మాజిపేట ఎస్ఐపై ఆరోపణలు అవాస్తవం..

తిమ్మాజిపేట ఎస్ఐపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు అవాస్తవమని నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆరోపణలకు ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.

నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం ముగింపు

నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌లో మార్చి 30 నుంచి నిర్వహిస్తున్న సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం నేటితో ముగిసినట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కే. బాలరాజు తెలిపారు. ప్రయాణికులకు ఉచితంగా చల్లని త్రాగునీరు, మజ్జిగ అంబలి పంపిణీ చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లాకు రూ.9,768 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదల

నాగర్‌కర్నూల్ జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9,768 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విడుదల చేశారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గృహ నిర్మాణం, విద్య, మహిళా సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు పెద్దపీట…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.