ఎస్ఐ మూత్ర విసర్జన చేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని డీఎస్పీ వెల్లడించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని విచారణ అధికారి సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై ఎస్ఐతో పాటు విచారణ అధికారి సీఐ అశోక్ రెడ్డి పూర్తి వివరాలను వెల్లడించారు. ఘటనకు సంబంధించి వాస్తవాలను పరిశీలించకుండా కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన అపోహలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానెళ్లను హెచ్చరించారు. అసత్యాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తే సంబంధిత యూట్యూబ్ ఛానెళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, అధికారికంగా వెల్లడించే వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.: తిమ్మాజిపేట ఎస్ఐపై ఆరోపణలు అవాస్తవం..
