Tag: Telangana Police

38 ఏళ్ల పోలీస్ సేవలకు వీడ్కోలు..

సిద్దాపూర్ ఎస్సైగా విధులు నిర్వహించిన అంజయ్య 38 ఏళ్ల పోలీస్ సేవల అనంతరం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆయనను ఘనంగా సన్మానించారు.

తిమ్మాజిపేట ఎస్ఐపై ఆరోపణలు అవాస్తవం..

తిమ్మాజిపేట ఎస్ఐపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఆరోపణలు అవాస్తవమని నాగర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆరోపణలకు ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.

పోలీసు సిబ్బంది దృఢత్వానికి క్రీడలు అవసరం..

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని…

సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ..

వార్షిక తనిఖీలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అచ్చంపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం…

నాగర్‌కర్నూల్ సర్కిల్ ఆఫీస్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నాగర్‌కర్నూల్ సర్కిల్ ఆఫీస్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ వార్షికంగా తనిఖీ చేసి, పరిశుభ్రత, ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ కేసుల క్లియరెన్స్, రౌడీషీటర్లపై నిఘా వంటి అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం…

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు, తనపై కేసు పెట్టిన కుటుంబంపై ప్రతీకారంతో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

వార్షిక తనిఖీల్లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

బీఆర్ఎస్ ఆందోళన మధ్య మానవత్వం చాటిన సీఐ అశోక్ రెడ్డి..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి వృద్ధ రైతును "భోజనం చేశావా పెద్దాయన?" అంటూ ఆప్యాయంగా పలకరించిన ఘటన అందరి మనసులను హత్తుకుంది.

విధుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..

నాగర్‌కర్నూల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ముగ్గురు పోలీసు అధికారుల కుటుంబాలకు తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఒక్కొక్కరికి రూ.99,800 చొప్పున విడో కార్పస్ ఫండ్ చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అందజేశారు.

నాగర్ కర్నూల్‌లో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ’పై అవగాహన సదస్సు

నాగర్ కర్నూల్ సాయి గార్డెన్‌లో జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో ‘డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి ధ్యేయం’ కార్యక్రమం నిర్వహించారు. యువత, తల్లిదండ్రులు డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.