Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

ప్రజావాణిలో 9 ఫిర్యాదులు స్వీకరణ

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ 9 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి అవసరం

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 34 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని అదనపు కలెక్టర్లు సూచించారు.

సోమశిలలో అరుదైన దృశ్యం

నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో కృష్ణా నది బ్యాక్‌వాటర్ తగ్గడంతో సప్తనదుల సంగమ క్షేత్రంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం పూర్తిగా దర్శనమిస్తోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

పాలెం వెంకన్న దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు.

తిమ్మాజీపేట కేజీబీవీపై డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు

ఇంద్రకల్‌లో ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఇంద్రకల్ గ్రామంలో విజయవంతంగా ముగిసింది. గ్రామాభివృద్ధి, వ్యవసాయ అవగాహన కార్యక్రమాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.

ఎస్‌ఎస్‌సి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పూర్తి నిషేధం విధించారు.

మార్చి 26న నాగర్ కర్నూల్‌లో ఉచిత కంటి చికిత్స శిబిరం

నాగర్ కర్నూల్‌లో మార్చి 26న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. క్యాటరాక్ట్ ఉన్న రోగులకు ఉచిత ఆపరేషన్లు కూడా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మార్చి 28లోపు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మార్చి 28లోపు తమ ఆదాయ-వ్యయ వివరాలు సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి సూచించారు. గడువు దాటితే అనర్హత విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

శాస్త్రోక్తంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం

నాగర్ కర్నూల్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాలాన్ని తెలుసుకొని మెలిగితే దైవానుగ్రహం లభిస్తుందని అర్చకులు తెలిపారు.