Category: Nagarkurnool News

నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.

నాగర్ కర్నూల్‌లో ఉగాది కవి సమ్మేళనం అలరింపు

నాగర్ కర్నూల్‌లో కందనులు కళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం కవితలు, గేయాలతో ఆకట్టుకుంది. పలువురు కవులు, గాయకులు పాల్గొని సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించారు.

లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి పర్యటన

నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్‌లో డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి పర్యటన సేవా కార్యక్రమాలు, సన్మానాలతో విజయవంతంగా జరిగింది. క్లబ్ సేవలను గవర్నర్ ప్రశంసించారు

ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పొల్యూషన్ కంట్రోల్ అధికారి సాజీనా పిలుపునిచ్చారు.

ప్రతిభ చూపిన ఆరోగ్య కార్యకర్త నిరంజనమ్మ

హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన ఆరోగ్య కార్యకర్త నిరంజనమ్మను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్ సన్మానించారు.

టీఎన్జీవో ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు, ఉద్యోగులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.

బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి

నాగర్ కర్నూల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.

డిజిటల్ విధానంలో జనాభా గణనకు సిద్ధం కావాలి

భారతదేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనాభా గణన జరగనుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో తప్పులు లేకుండా గణన నిర్వహించాలని సూచించారు.

ఉపాధి హామీ పనుల్లో కూలీలకు వేతనాలు చెల్లించాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సిపిఎం నాయకుడు గుంపల్లి అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

వచ్చేనెల 20లోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించి, వచ్చేనెల 20లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఆశా వర్కర్ల డిమాండ్లకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద నిరసన

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిర్వహించిన వంట వార్పు నిరసనకు BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఫిక్స్డ్ వేతనం, PF, ESI వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.