నాగర్ కర్నూల్, జూలై 11

నాగర్ కర్నూల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ స్థాపించి దాదాపు 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అసోసియేషన్ సభ్యుల సేవా ప్రస్థానంలో మరో నూతన మైలురాయి చేరింది. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారుల ఐక్యత, సేవాభావం, పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్న అసోసియేషన్ సొంత నూతన భవనాన్ని నిర్మించుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

కుల, మత భేదాలకు అతీతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సభ్యులు అసోసియేషన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. నూతన భవన నిర్మాణానికి అవసరమైన స్థల సమీకరణ, ఆర్థిక సహాయం, నైతిక మద్దతు వంటి అనేక అంశాల్లో సభ్యులందరూ తమ వంతు సహకారం అందించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుత గౌరవ అధ్యక్షులు మిరుదొడ్డి శ్యాంసుందర్ నాయకత్వం, కృషి భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.

నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని **జూలై 12న ఉదయం 10 గంటలకు** నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కమిటీ వెల్లడించింది. ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం సభ్యులు, ఆహ్వానితులకు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

అసోసియేషన్ సభ్యులందరూ ఈ సమాచారాన్ని వ్యక్తిగత ఆహ్వానంగా భావించి, ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా కుటుంబ సభ్యులతో కలిసి సమయానికి నూతన భవనం వద్దకు చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ కమిటీ తరఫున పీఆర్వో బాదం పరమేశ్వర్ సభ్యులందరికీ పేరుపేరునా ఆహ్వానం పలికారు.: 40 ఏళ్ల సేవా ప్రస్థానంలో నూతన మైలురాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *