Tag: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్‌లో భారీ బైక్ చోరీ ముఠా గుట్టురట్టు..

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీసులు భారీ బైక్ చోరీ ముఠాను ఛేదించి 52 దొంగిలించిన మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు డ్రగ్స్ కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులతో విద్యార్థుల భద్రతకు ముప్పు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి సమీపంలోని సెవెంత్ సెంటర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుగుణ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.

40 ఏళ్ల సేవా ప్రస్థానంలో నూతన మైలురాయి…

నాలుగు దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న నాగర్ కర్నూల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ నూతన మైలురాయిని చేరుకుంది.

మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

జిల్లా రెవెన్యూ అధికారిని ఘనంగా సన్మానించిన టీఎన్జీవో నాయకులు

నాగర్ కర్నూల్ జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. పాండును టీఎన్జీవో జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జిల్లా ప్రజలకు సేవ చేయుటకు స్వాగతం పలికారు.

తిమ్మాజిపేటలో ఘనంగా ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర

తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర ఘనంగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.

జర్నలిస్టు కూతురు చదువు కోసం ముందుకొచ్చిన జర్నలిస్టులు

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు రామస్వామి కూతురు చదువు కొనసాగించేందుకు జర్నలిస్టులు కలిసి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఐజేయూ సభ్యులు, జర్నలిస్టు నాయకులు పాల్గొని మానవత్వాన్ని చాటారు.