నాగర్ కర్నూల్లో భారీ బైక్ చోరీ ముఠా గుట్టురట్టు..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీసులు భారీ బైక్ చోరీ ముఠాను ఛేదించి 52 దొంగిలించిన మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు డ్రగ్స్ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
