దుందుభి వాగుపై రూ.20.20 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన
నాగర్కర్నూల్ జిల్లా సిర్సివాడ సమీపంలో దుందుభి వాగుపై రూ.20.20 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో నాగర్కర్నూల్–జడ్చర్ల అనుసంధానం బలోపేతమై ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
