Tag: Telangana news

కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రి సీజ్

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అక్రమ అబార్షన్ల ఆరోపణల నేపథ్యంలో కొల్లాపూర్‌లోని సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేశారు.

ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ

నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజలకు అందించే త్రాగునీరు పూర్తిగా శుద్ధితో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం పంపిణీ

పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

మైసమ్మ ఆలయంలో డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు

పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి గ్రామంలోని మైసమ్మ ఆలయాన్ని డీఎస్పీ శ్రీనివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వేసవి కాలంలో రక్త కొరతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి జాతర ఏర్పాట్లు

చారకొండ మండలం సిర్సనగండ్ల అయోధ్యనగర్ గుట్టపై జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు/జాతర ఏర్పాట్లపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సిబ్బందిని సత్కరించి చీరలను పంపిణీ చేశారు.

పరిశుభ్రతపై నిర్లక్ష్యం: తెల్కపల్లి పిహెచ్‌సీ వైద్యులపై ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపాలను గమనించి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు.