Category: Telangana News

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.

వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…

నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం…

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా సిగ్నల్ వద్ద XL లూనాను బులెరో వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్ అంతరాయాలకు చెక్ – ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ కీలక ప్రకటనలు

నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ విద్యుత్ అంతరాయాల నివారణకు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు

ప్రజా పాలనలో పర్యావరణ చైతన్యం – నాగర్ కర్నూల్‌లో జనపనార సంచుల పంపిణీ

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు నగర కిరాణా వర్తక సంఘం సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర సూచించారు. వరద ప్రాంతాలు, విద్యుత్ తీగలు, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

భక్తిశ్రద్ధలతో 23వ లక్ష్మీ నారసింహస్వామి మహా పూజ వైభవం

జడ్చర్లలో నవనారసింహులు బాదం హైమావతి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 23వ లక్ష్మీ నారసింహస్వామి మహా పూజ వైభవంగా జరిగింది. పల్లకి సేవ, భజనలు, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ భక్తులను ఆకట్టుకున్నాయి.

జిల్లా రెవెన్యూ అధికారిని ఘనంగా సన్మానించిన టీఎన్జీవో నాయకులు

నాగర్ కర్నూల్ జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. పాండును టీఎన్జీవో జిల్లా నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జిల్లా ప్రజలకు సేవ చేయుటకు స్వాగతం పలికారు.

తిమ్మాజిపేటలో ఘనంగా ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర

తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర ఘనంగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.

నాగర్ కర్నూల్ బస్టాండ్‌లో సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం ముగింపు

నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌లో మార్చి 30 నుంచి నిర్వహిస్తున్న సత్యసాయి చలివేంద్రం, అంబలి కేంద్రం నేటితో ముగిసినట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కే. బాలరాజు తెలిపారు. ప్రయాణికులకు ఉచితంగా చల్లని త్రాగునీరు, మజ్జిగ అంబలి పంపిణీ చేశారు.