తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
తిమ్మాజిపేట రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు కార్డులు, చెక్కులు అందజేశారు.
తిమ్మాజిపేట రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు కార్డులు, చెక్కులు అందజేశారు.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
నాగర్ కర్నూల్లో హెల్త్ వీక్ ప్రారంభం. ‘ఈట్ రైట్ – వాక్’ ర్యాలీతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెలలో దివ్యాంగుల కోసం UDID మరియు సదరం సర్టిఫికేట్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న ఆశా కార్యకర్తలకు రెండు చొప్పున చీరలను అందజేశారు.