Tag: nagarkurnool

డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మిక తనిఖీ

పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డా. రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎండాకాలం జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.

పాలమూరు చరిత్రను వెలుగులోకి తెచ్చిన మహనీయుడు

పాలమూరు చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్సై

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడిలో 750 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

పాలెం ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.

పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.

లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలి

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు మంచి దిగుబడి ఇస్తుందని తెలిపారు.

ఆవంచలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

నాగర్ కర్నూల్ మండలంలోని ఆవంచ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.

ఏప్రిల్ 2న గ్రామ సభలు విజయవంతం చేయాలి

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.