ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్సై
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడిలో 750 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాలెం ఇండస్ట్రియల్ పార్క్ను సందర్శించి ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నామని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. గణిత పరీక్షకు 99.81% హాజరు నమోదైంది.
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంభించి లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు రైతులకు మంచి దిగుబడి ఇస్తుందని తెలిపారు.
నాగర్ కర్నూల్ మండలంలోని ఆవంచ గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఏప్రిల్ 2న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించగా, కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన కార్యక్రమంలో రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు.