జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల పునఃప్రవేశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల పునఃప్రవేశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
నాగర్కర్నూల్కు చెందిన 52 ఏళ్ల మహిళకు తీవ్రమైన గుండెపోటు సమస్యను మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యవసర యాంజియోప్లాస్టీ ద్వారా విజయవంతంగా చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో లక్ష అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ…
నంది వడ్డేమాన్ గ్రామంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించి, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమర్నాథ్, కేదార్నాథ్, చార్ ధాం యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.
నాగర్ కర్నూల్లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళా వ్యాపారులకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. అవసరమైన వారికి మహబూబ్నగర్లో ఉచిత కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నాగర్ కర్నూల్లో తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికలను జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి టీజేఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
నాగర్ కర్నూల్లో సోషల్లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగర్ కర్నూల్ రాంనగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు.