కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంపై అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంపై అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కొల్లాపూర్ మండలం సింగోటం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తన వాహనంలో ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్యసాయం అందించారు. మంత్రి మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.
క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానాన్ని సాధించిన నాగర్కర్నూల్ జిల్లాకు మరో గౌరవం దక్కింది. ఉత్తమ జిల్లా టిబి అధికారిగా డాక్టర్ ఎం.డి. రఫీకి తెలంగాణ గవర్నర్ అవార్డు లభించగా, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సన్మానించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీలో నాగర్కర్నూల్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని సీఎస్ సంజయ్ జాజు ప్రశంసించారు. ఆగస్టు 25లోగా రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) సమావేశంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు.
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూర్ మండలానికి చెందిన రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు. నీటి పొదుపుతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.
2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కోసం DOST స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. స్పెషల్ ఫేజ్ అనంతరం అడ్మిషన్లు ఉండవని నాగర్కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.
పదేపదే న్యుమోనియా, దగ్గుతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడి శ్వాసనాళంలో నాలుగేళ్లుగా చిక్కుకున్న ఆట వస్తువు ‘ఈల’ను మలక్పేట్ యశోదా ఆసుపత్రి వైద్యులు అధునాతన బ్రోంకోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించారు. ఓపెన్ సర్జరీ లేకుండానే చికిత్స నిర్వహించడంతో బాలుడు వేగంగా కోలుకున్నాడు.