Tag: Voice of Nagarkurnool

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు.

నాగర్‌కర్నూల్‌లో కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వేడుకలు

నాగర్‌కర్నూల్‌లో వాసవి క్లబ్, వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు సిల్వర్ స్టార్ KCGF దాతలను సన్మానించారు

రిటైర్ అయిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ మంజూరు చేయాలి…

నాగర్ కర్నూల్‌లో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం నిర్వహించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, రెండో పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నవజాత శిశువుకు తల్లిపాలే అమృతం.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. టి. ఉషారాణి నవజాత శిశువుకు పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలను ఇవ్వాలని సూచించారు. తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే శిశువుకు సంపూర్ణ…

జర్నలిస్టుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం కొనసాగిద్దాం:

నాగర్‌కర్నూల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జి. మధు గౌడ్ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

హైపర్‌సైట్‌తో క్యాన్సర్ చికిత్సలో విప్లవం యశోద హాస్పిటల్స్

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి ప్రకారం, హైపర్‌సైట్ అడాప్టివ్ రేడియేషన్ థెరపీతో క్యాన్సర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ 40% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు స్క్రీనింగ్, జీవనశైలి మార్పులు, ధూమపానం మానేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని…

ఫీజుల బకాయి – BJP లడాయి

నాగర్‌కర్నూల్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో 'ఫీజుల బకాయి – BJP లడాయి' పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు.

శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి ప్రత్యేక అనుమతి..

నల్లమల్ల అడవుల్లోని శ్రీ లొద్ది మల్లయ్య స్వామి దర్శనానికి భక్తులకు ప్రత్యేక అనుమతి లభించింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ అధికారులతో చర్చించి ఈ అనుమతి సాధించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం విజయమే..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమేనని, ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు…

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు..

తొలి ఏకాదశి, శనివారం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో తిలతైల అభిషేకాలు, ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.