ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమని అన్నారు. బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల్లో ఉన్న తప్పులు, లోపాలను సరిచేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న ఎమ్మెల్యే, అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితాకు దూరం కాకుండా పార్టీ నాయకులు, బీఎల్ఏలు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అంశాలపై చర్చించారు.: బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో SIRపై బీఎల్ఏల సమావేశం.


