నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ
నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.
నాగర్కర్నూల్లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
2027 జనగణనలో గిరిజనులను ప్రత్యేకంగా గుర్తించేందుకు ప్రత్యేక కాలం కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 6 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. మొత్తం 44 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక సదరం శిబిరంలో 44 మంది అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని వైద్యులు పరీక్షించారు. అలాగే దృష్టిలోపం ఉన్న 10 మంది రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్…
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ పాల్గొన్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో…
నాగర్కర్నూల్ పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థినులకు వార్డెన్ రాధా ప్రోత్సాహకరంగా సూచనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి హాస్టల్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్పివి (HPV) వాక్సినేషన్ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. బాలికలను గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఈ టీకా ఎంతో అవసరమని వైద్యాధికారులు తెలిపారు.