ప్రతిభ చూపిన ఆరోగ్య కార్యకర్త నిరంజనమ్మ
హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన ఆరోగ్య కార్యకర్త నిరంజనమ్మను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్ సన్మానించారు.
హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచిన ఆరోగ్య కార్యకర్త నిరంజనమ్మను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి. సంతోష్ సన్మానించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో టీఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు, ఉద్యోగులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
నాగర్ కర్నూల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.
భారతదేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనాభా గణన జరగనుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో తప్పులు లేకుండా గణన నిర్వహించాలని సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని సిపిఎం నాయకుడు గుంపల్లి అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించి, వచ్చేనెల 20లోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిర్వహించిన వంట వార్పు నిరసనకు BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఫిక్స్డ్ వేతనం, PF, ESI వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డా. విశారదన్ మహరాజ్ అరెస్టును ఖండిస్తూ నాగర్కర్నూల్లో BC, SC, ST JAC మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.