నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ గురువారం ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. ఈ శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలోని గది నెంబర్ 102లో జరుగుతుంది.

ఈ శిబిరంలో పాల్గొనే రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి, ముఖ్యంగా క్యాటరాక్ట్ (ముత్యబిందు) సమస్య ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా అక్కడికి తరలిస్తారు.

శిబిరానికి వచ్చే రోగులు ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని వాటి రిపోర్టులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలు మరియు ఫోన్ నంబర్ తీసుకురావాలని తెలిపారు.

మరిన్ని వివరాలకు 9440876556, 7386940480 నంబర్లను సంప్రదించవచ్చు.: మార్చి 26న నాగర్ కర్నూల్‌లో ఉచిత కంటి చికిత్స శిబిరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *