వంగూర్‌లో అక్రమ LPG గ్యాస్ వినియోగం బట్టబయలు

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ సమీపంలో యోగి రెస్టారెంట్‌లో గృహ LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. రెండు సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఎల్పీజీ గ్యాస్‌పై కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.

పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన–వినోద పర్యటన

నాగర్ కర్నూల్‌లోని పల్లవి మోడల్ స్కూల్ నాలుగో, ఐదో, ఆరవ తరగతుల విద్యార్థులు మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రం, సైన్స్ మ్యూజియం మరియు మయూరి పార్క్‌ను సందర్శిస్తూ విజ్ఞాన–వినోద పర్యటనలో పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు మార్చి 15 నుంచి ద్వితీయ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

కొండారెడ్డిపల్లిలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ ప్రారంభం

బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రామాన్ని ఆదర్శ సౌర గ్రామంగా అభివృద్ధి చేయాలని…

జిల్లాలో మూడు కేజీబీవీలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక

నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి, వెల్దండ, నాగర్ కర్నూల్ కేజీబీవీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

రైతుల కష్టాలు నేతలకు పట్టవా?

నాగర్ కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.

నంది వడ్డేమాన్‌లో శనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.