కార్యక్రమంలో గుడిపల్లి నరసింహారెడ్డి, ఆర్ సత్యం, వి రామకృష్ణ, కేశవాచారి తదితర రంగస్థల కళాకారులను ఘనంగా సత్కరించారు. వారి సేవలను కొనియాడుతూ, నాటక రంగ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాసా రాఘవేందర్, జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ప్రతినిధులు బాలరాజ్, లక్ష్మణ్, ప్రసాద్, శ్రీను, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నాటక రంగం సమాజంలో అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, యువత ఈ రంగంపై ఆసక్తి చూపాలని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం సాంస్కృతిక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.: రంగస్థల కళాకారులకు సన్మానం
