నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.
నాగర్ కర్నూల్లోని పల్లవి మోడల్ స్కూల్ నాలుగో, ఐదో, ఆరవ తరగతుల విద్యార్థులు మహబూబ్నగర్లోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రం, సైన్స్ మ్యూజియం మరియు మయూరి పార్క్ను సందర్శిస్తూ విజ్ఞాన–వినోద పర్యటనలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు మార్చి 15 నుంచి ద్వితీయ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి గ్రామాన్ని ఆదర్శ సౌర గ్రామంగా అభివృద్ధి చేయాలని…
బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి శనివారం సందర్భంగా భక్తులు తిలతైల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శ్రీశైలం దర్శనానికి వెళ్తూ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్లోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్ వద్ద ఆగగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్…
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా అధికారులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య పరీక్షలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మహిళా సిబ్బందిని ప్రోత్సహించారు.
లింగాల మండలంలోని కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వాసవి క్లబ్ లింగాల ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో గృహావసరాలు, విద్యాలయాలు, ఆసుపత్రులకు ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సాగు, తాగునీటి సమస్యలు కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.